ఈ మధ్య కాలంగా హిందీ సినీ పరిశ్రమలో పెళ్లి కాకుండానే సరోగసి ద్వారా బిడ్డలకు జన్మినిస్తున్నారు. బాలాజీ టెలీ ఫిలిమ్స్ ద్వారా ‘కుమ్ కుమ్ భాగ్య’, కుండలి భాగ్య, కసమ్ లాంటి పలు హిట్ సీరియల్స్ తో పాటు ‘ది డర్టీ పిక్చర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, వీర్ దె వెడ్డింగ్’ లాంటి చిత్రాలని నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ సరోగసి ద్వారా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
కాగా ఏక్తా కపూర్ ఒకప్పటి సీనియర్ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె. ఆమెకు క్వీన్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ అనే బిరుదు కూడా ఉంది. అయితే గతంలో ఆమె సోదరుడు తుషార్ కపూర్ కూడా సరోగసీ ద్వారా బిడ్డను పొందాడు.


