చిన్ననాటి జ్ఞాపకాలు, స్కూల్ డేస్ బ్యాక్డ్రాప్తో వచ్చే ప్యూర్ ఎమోషనల్ కథలకు డిజిటల్ ఆడియన్స్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్తో వచ్చి రీసెంట్గా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన లేటెస్ట్ నోస్టాల్జియా సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. విరాజ్ అశ్విన్, యశస్విని రావు లీడ్ రోల్స్ పోషించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కొద్దిరోజుల క్రితమే (జూలై 3న) ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా విడుదలైంది. అక్కడ ప్రేక్షకుల నుంచి హార్ట్ టచింగ్ రెస్పాన్స్ అందుకొని బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సిరీస్.. ఇప్పుడు గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ద్వారా మరింత మంది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
ఐదు భాషల్లో గ్రాండ్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఈ బ్యూటిఫుల్ సిరీస్ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్.. దీని స్ట్రీమింగ్ డేట్ను అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. జూలై 10 నుంచి ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. మొదటగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుండగా, చాలా త్వరలోనే హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. ‘ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్’ అంటూ నెట్ఫ్లిక్స్ వదిలిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఆకట్టుకునే పాతరోజుల జ్ఞాపకాలు
ప్రేక్షకులను మళ్లీ తమ పాత రోజుల్లోకి, స్కూల్ లైఫ్లోకి తీసుకెళ్లేలా ఈ సిరీస్ను డైరెక్టర్ వినోద్ గాలి చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. శరత్ చంద్ర నాయుడు నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో విరాజ్ అశ్విన్ నటనకు, స్కూల్ డేస్ ఎపిసోడ్స్కు మంచి మార్కులు పడ్డాయి. పాత కాలపు రేడియోలు, ఆడియో క్యాసెట్లు, సైకిల్ ప్రయాణాలు.. ఇలా ప్రతీ ఒక్కరి లైఫ్కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో చాలా సహజంగా ఉంటాయి. ఈటీవీ విన్లో ఈ సిరీస్ను మిస్ అయిన వారు రేపటి నుండి నెట్ఫ్లిక్స్లో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.


