కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున పవర్ఫుల్ విలన్ రోల్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సాలిడ్ రివెంజ్ యాక్షన్ డ్రామా కూలీ కోసం అందరికీ తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్ లో విడుదల అయ్యిన ఈ సినిమా తమిళ్ లో బుల్లితెర ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
కానీ ఫైనల్ గా ఇప్పుడు తెలుగు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు తమిళ్ తో పాటు తెలుగులో కూడా నిర్మాణ సంస్థ సన్ టీవీ వారే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తెలుగులో సన్ జెమినీ టీవీలో ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకి ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
మరి ఇంత లేట్ గా వస్తున్న ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి రేటింగ్ అందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ లు కూడా నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
