కళ్యాణ్ రామ్ కూడా స్టార్ట్ చేశాడు

కళ్యాణ్ రామ్ కూడా స్టార్ట్ చేశాడు

Published on Dec 8, 2019 5:50 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తరహాలోనే మొదట పాటల్ని వదులుతున్నారు. మొదటి పాట ‘ఏమో ఏమో యే గుండెల్లో’ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు.

ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించడం జరిగింది. అందుకే పాటపై అంచనాలు అందుకుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు