రాజ్యసభకు నలుగురు సభ్యుల్లో ఇద్దరు చిత్రసీమ నుండి ఎంపిక … ఎవరంటే … ??

రాజ్యసభకు నలుగురు సభ్యుల్లో ఇద్దరు చిత్రసీమ నుండి ఎంపిక … ఎవరంటే … ??

Published on Jul 6, 2022 10:06 PM IST

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మొత్తం నలుగురు సభ్యులను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే ఆ నలుగురిలో ఇద్దరు మన చిత్రసీమకు చెందిన ప్రముఖులు కావడం విశేషం. మొత్తంగా ఆ నలుగురు దక్షిణాది వారు కావడం మరింత విశేషంగా చెప్పుకోవాలి. పిటి ఉష, వీరేంద్ర హెగ్డే, విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా లను కొద్దిసేపటి క్రితం కేంద్రప్రభుత్వం ఎంపిక చేయడంతో వారిలో ఇద్దరు చిత్రసీమ నుండి ఉండడంతో పలువురు సినిమా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో ఎన్నో వేల పాటలు కంపోజ్ చేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాటలు ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక రాజమౌళి తండ్రి వి విజయేంద్రప్రసాద్ కూడా తెలుగు సహా ఇతర భాషల ఆడియన్స్ కి కూడా కొంత సుపరిచితమే. రాజమౌళి తీసే ప్రతి సినిమాకి కథ అందించే విజయేంద్ర ప్రసాద్, ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయీజాన్ మూవీ కి స్టోరీ అందించారు.

ఇక పరుగుల రాణి గా తన అద్భుత ప్రతిభతో ఎన్నో పతకాలు గెలుచుకున్న పిటి ఉష కి కూడా ఎంత గొప్ప పేరు ఉంది. ఇక వీరితో పాటు కర్ణాటక కి చెందిన సమాజ సేవకుడు వీరేంద్ర హెగ్డే విద్య, ఆరోగ్యం విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కర్ణాటకలో ఆయనకు ఎంతో గొప్ప పేరుంది. ఇక ఈ నలుగురిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఒక్కొక్కరి గురించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వారి ప్రతిభని పొగుడుతూ ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన పోస్ట్ లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు