ఎన్టీఆర్ తరువాత సినిమా పై క్లారిటీ !

ఎన్టీఆర్ తరువాత సినిమా పై క్లారిటీ !

Published on Apr 9, 2020 9:36 PM IST

‘అల వైకుంఠపురములో’ అంటూ సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కాగా ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. లాక్ డౌన్ సందర్భంగా దొరికిన ఖాళీ సమయాన్ని త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే దృష్టి పెట్టాడట. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మధ్య ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్స్ కూడా నడుస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారట. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. మరి జాన్వీ ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు