తెలంగాణ రాజకీయాల పై రియాక్ట్ అయిన సీనియర్ హీరోయిన్ !

తెలంగాణ రాజకీయాల పై రియాక్ట్ అయిన సీనియర్ హీరోయిన్ !

Published on Sep 18, 2018 10:23 AM IST

సౌత్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్స్ లో గౌతమి ఒకరు. కమల్ హాసన్ తో బంధానికి తెగతెంపులు చేసుకున్నాక గౌతమి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ‘మనమంతా’ చిత్రంలో మోహన్ లాల్ తో కలిసి నటించి.. ఓ మధ్యతరగతి అమ్మగా అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే తాజాగా గౌతమి నేటి రాజకీయాల పై తనదైన శైలిలో స్పందించారు.

వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా, గౌతమి తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు కేసీఆర్ ముందస్తు ఎన్నికల పై, అలాగే తమిళ రాజకీయాల పై కూడా ఆమె మాట్లాడారు. ‘రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలి. ఇక తెలంగాణలోని ముందస్తు ఎన్నికల కారణంగా అక్కడి ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా అనేది పక్కన పెడితే.. ప్రజలు ఓ పార్టీ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే.. ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయి ప్రజలకు మనం ఎంతవరకూ న్యాయం చేస్తామనేది ఆలోచించాల్సిన విషయం’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు