అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న  “గోల్డ్ మెడల్ “

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న  “గోల్డ్ మెడల్ “

Published on Jun 25, 2021 8:00 AM IST

యు. కె. క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్,దేవిశ్రీ, రుక్మిణి, నటీనటులుగా  ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం “గోల్డ్ మెడల్ :first_place_medal:” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ ముంత మాట్లాడుతూ ..ఈ కథ లోని పాత్రలు బంగారంతో  యే విదంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమే “గోల్డ్ మెడల్ :first_place_medal:.నిర్మాతకు నేను కథ చెప్పిన వెంటనే  నాపై నమ్మకంతో ఈ చిత్రానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం జరిగింది.నేను ఏ లొకేషన్ కావాలన్నా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించినందుకు ఆయనకు నా ధన్యవాదాలు. నటీనటులు అందరూ కూడా బాగా సహకరించారు. చిత్రం చాలా బాగా వచ్చింది.

నిర్మాత నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం ఉంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. నిర్మాత నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మన జీవితంలో బంగారంతో విడదీయరాని బంధం ఉంది, ఒకరికి నగల మోజు, ఇంకొకరికి వ్యాపారం, మరొకరికి  మొక్కుబడి, ప్రతి ఒక్కరికీ బంగారం సెంటిమెంట్ ఈ సినిమాలో కథా నాయకుడు జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు తిప్పింది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు నాకు ఏవిదమైన కథ చెప్పాడో అలాగే తీశాడు.నటీనటులు అందరూ చక్కగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాము.  ఒక కొత్త ప్రయత్నం తో మేము  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు