ఫెయిల్యూర్ కాంబినేషన్ మళ్ళీ ఫిక్స్ అయింది !

ఫెయిల్యూర్ కాంబినేషన్ మళ్ళీ ఫిక్స్ అయింది !

Published on Jul 18, 2018 12:56 PM IST

గోపీచంద్ వరుసగా కొన్ని పరాజాయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అది ప్రధానంగా లవ్ ఎంటర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అట.

ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సంపత్ నందితో కథా చర్చలు జరుగుతున్నాయని పంతం ప్రమోషన్స్ లో స్వయంగా గోపీచందే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం కథ ఫైనల్ అయిందని తెలుస్తోంది. సంపత్ నంది చెప్పిన కథ గోపిచంద్ కి బాగా నచ్చిందట. ఇక ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అయినా ఈ కాంబినేషన్ లో ఇంత త్వరగా సినిమా ఫిక్స్ అవ్వడం విశేషమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు