క్షణం, గూఢచారి వంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు హీరో అడవి శేషు. తన తదుపరి మూవీ వివరాలు నేడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఆయన. “ఎవరు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ మూవీకి పెట్టారు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్సు థ్రిల్లర్ గా ఈమూవీ తెరకెక్కుతుంది.
సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఈ సినిమా షూటింగ్ రహస్యంగా మీడియా కి సమాచారం లేకుండా పూర్తి చేసారంట. అడవి శేషుకి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా చేస్తున్న ఈ మూవీలో నవీన్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కారక్యమాలు పూర్తిచేసి ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
After Goodachari, Happy to announce my next #EVARU ! Shot in secret to preserve the twists :blush: @reginacassandra @Naveenc212 @murlisharma72 Dialogues by my guru @abburiravi garu #Sricharan @Garrybh88 @Vamsi_P1988
Directed by talented Venkat Ramji. Releases August 23! #EvaruOnAug23 pic.twitter.com/QJDly9rPuw— Adivi Sesh (@AdiviSesh) June 3, 2019