ప్రభాస్ మూవీ స్టోరీ పై హింట్ ఇచ్చిన పూజ.

ప్రభాస్ మూవీ స్టోరీ పై హింట్ ఇచ్చిన పూజ.

Published on Mar 24, 2020 11:42 AM IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ పీరియడ్ లవ్ డ్రామాగా వస్తున్న సంగతి తెల్సిందే. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగింది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ఈ చిత్ర కథపై కొంచెం హింట్ ఇచ్చారు.

ఈ చిత్రం పీరియాడిక్ లవ్ డ్రామా అయినప్పటికీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉంటుందట. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఓ ఫ్రెష్ పాయింట్ ఈ చిత్రంలో చూపించనున్నారట. ఇక లీడ్ పెయిర్ మధ్య సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ లవ్ స్టోరీ నడుస్తుందట. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు