వెంకీ -చైతుల మల్టీ స్టారర్ లో హీరోయిన్స్ ఎవరంటే ?

వెంకీ -చైతుల మల్టీ స్టారర్ లో హీరోయిన్స్ ఎవరంటే ?

Published on Jun 24, 2018 11:14 PM IST


విక్టరీ వెంకటేష్ ,నాగ చైతన్య లు కలిసి బాబీ దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారని అందరికీ తెలిసిందే .అయితే ఇప్పుడు ఈ చిత్రంలో వీరి సరసన నటించే కథనాయికలను ఎంపిక చేశారని సమాచారం. వెంకీ కి జోడిగా నయనతార ను చైతు జోడిగా సమంతను తీసుకుంటున్నట్లుగా చిత్ర వర్గాల నుండి సమాచారం వస్తుంది . అయితే అధికారికంగా ఈవిషయం ఫై ఎలాంటి ప్రకటన చేయలేదు .

నయనతారకు వెంకటేష్ తో ఇది నాల్గవ సినిమా గతంలో వీరిద్దరూ కలిసి లక్ష్మి , తులసి , బాబు బంగారం చిత్రాల్లో నటించారు . ఇక సమంతకు కూడా చైతు తో ఇది నాల్గవ చిత్రం గతంలో వీరిద్దరి కలయికలో ఏమాయ చేశావే , మనం , చిత్రాల్లో నటించారు . ఇవి గాక వీరిద్దరూ నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు .

ఇక వెంకీ, చైతు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని తెలుస్తోంది. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు