సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న ‘రెడ్’ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా చేరింది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ కనిపించబోతుంది. హీరోయిన్ గా హిట్లు లేని ఈ బ్యూటీ ప్రస్తుతానికి సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో బండి నెట్టుకొస్తోంది. అన్నట్టు ఈ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద చిత్రీకరిస్తున్నారు.
కాగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.