సుశాంత్ మరణం పై హృతిక్ తల్లి ఆసక్తికర పోస్ట్!

సుశాంత్ మరణం పై హృతిక్ తల్లి ఆసక్తికర పోస్ట్!

Published on Oct 22, 2020 10:45 AM IST

గత కొన్ని నెలల కితం బాలీవడ్ టాలెంటెడ్ హీరో మరియు యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఇంట్లోనేఆత్మ హత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనం నెలకొల్పిందో తెలిసిందే. అలాగే ఈ ఏడాది నెలకొన్న తీవ్ర విషాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అక్కడ నుంచి ఇది ఆత్మహత్య కాదు హత్యే అని ప్రచారం మొదలు కావడంతో అక్కడ నుంచి సుశాంత్ అభిమానులు మరియు సుశాంత్ సింగ్ సానుభూతిపరులు పెద్ద ఎత్తున గళమెత్తి పోరాటం చెయ్యడంతో ఆ కేసు సిబిఐ కు వెళ్ళింది.

కానీ ఇటీవలే వారి నుంచి కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో సుశాంత్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే అది ఇంకా తుది తీర్పు కాదని మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్ అగ్ర హీరోలపై అనేక విమర్శలు వచ్చాయి. అలా విమర్శలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎదుర్కొన్నారు.

అయితే ఇప్పుడు స్వయానా హృతిక్ తల్లే సుశాంత్ సింగ్ మరణంపై పెట్టిన ఒక ఆసక్తికర పోస్ట్ ను పెట్టడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇంతకు ఆ పోస్ట్ లో ఏముందంటే “ప్రతీ ఒక్కరికీ నిజం ఏమిటీ అన్నది కావాలి కానీ ఎవరూ కూడా నిజాయితీగా ఉండరు” అని సుశాంత్ ఫోటోను పెట్టి పోస్ట్ చేసారు. దీనితో హృతిక్ కుటుంబ అభిమానులు సుశాంత్ పట్ల వ్యతిరేఖులు కాదని అంటున్నారు.

https://www.instagram.com/p/CGm93ocpcgI/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు