విలన్ కి నేషనల్ అవార్డు ఆశించిన దర్శకుడు

విలన్ కి నేషనల్ అవార్డు ఆశించిన దర్శకుడు

Published on Mar 19, 2013 3:58 AM IST

rajamouli

ఎస్.ఎస్ రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాకి ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాలలో రెండు నేషనల్ అవార్డులు వరించాయి. ఈరోజు ఉదయం ప్రకటించిన ఈ అవార్డులలో తెలుగు సినీ రంగానికి చెందిన చిత్రాలలో ‘ఈగ’ ఒక్కటే విజేతగా నిలిచింది. “లభించిన అభినందనలకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరి అభినందనలూ మా యూనిట్ మొత్తానికీ తెలియజేస్తాను. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ నేను ఉహించినదే. మకుటలో పనిచేస్తున్న యువ యానిమేషన్ టీం కి నా ప్రత్యేక ప్రశంసలు. ఈ కధను, ‘ఈగ’ సినిమాలోని భావాన్ని నమ్మిన నా నిర్మాత సాయి గారికి, నా కలను నిజం చేసిన సురేష్ బాబుగారికి ధన్యవాదాలు అని” రాజమౌళి ట్వీట్ చేసాడు.
ఇదిలా ఉండగా రాజమౌళికి ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఈ రెండు అవార్డులు సొంతం చేసుకున్నా సరే అత్యద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సుదీప్ కి కుడా అవార్డు వస్తే మరింత బాగుండేది అని రాజమౌళి అన్నారు. “సుదీప్ పనితీరుకి గనుక గుర్తింపు వచ్చి ఉంటే నేను మరింత ఆనందపడేవాడిని. అతను లేకుండా ‘ఈగ’ ఇంత అందంగా రాదని” ట్విట్టర్లో జత చేసాడు. ‘ఈగ’ సినిమా తరువాత సుదీప్ విలన్ క్యారెక్టర్లకి చిరునామాగా మారిపోయాడు. ‘ఈగ’ తరువాత అతను ‘యాక్షన్ 3డి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు