‘ఇద్దరి లోకం ఒకటే’ నుండి జ్యూక్ బాక్స్ !

‘ఇద్దరి లోకం ఒకటే’ నుండి జ్యూక్ బాక్స్ !

Published on Dec 13, 2019 8:00 PM IST

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా జ్యూక్ బాక్స్ విడుదల అయింది. సాంగ్స్ కు ప్రేక్షుకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల కానుంది. ట్రైలర్ ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు