బ్యాంకాక్ లో ప్రారంభం కానున్న ఇడియట్-2

బ్యాంకాక్ లో ప్రారంభం కానున్న ఇడియట్-2

Published on Dec 1, 2011 2:50 PM IST


పూరి జగన్నాధ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఆయన మాస్ మహారాజా రవితేజతో చేయనున్న సినిమా ‘ఇడియట్-2’ మార్చి 15న ప్రారంభం కానుంది. ఇలియానా హీరోయిన్ గా చేయనున్న ఈ సినిమాని బివీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారు. ఈ సినిమా గతంలో పూరి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమా కి సీక్వెల్ గా రాబోతుంది అని సమాచారం. ఇడియట్ సినిమాతో రవితేజ కెరీర్ ను మార్చేసారు పూరి జగన్నాధ్.

ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న పూరి ఇవే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరియు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో కూడా చేయనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు