ఎన్టీఆర్ ఫ్యాన్స్ మిస్సయితే పవన్ ఫ్యాన్స్ కొడతారట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మిస్సయితే పవన్ ఫ్యాన్స్ కొడతారట!

Published on Oct 18, 2020 9:02 AM IST

మళ్ళీ చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ బడా చిత్రాలకు సంబంధించి వరుస అప్డేట్స్ తో రచ్చ స్టార్ట్ కానుంది. అయితే వాటిలో అతి కీలకమైనది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రానున్న భీం టీజర్. దర్శక ధీరుడు రాజమౌళి తారక్ మరియు చరణ్ లతో చేస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం” నుంచి కట్ చేసిన ఈ టీజర్ ఈ అక్టోబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే స్కై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొల్పుకున్న ఈ టీజర్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆకలిగా ఎదురు చూస్తున్నారు. పైగా తారక్ నుంచి వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో రికార్డుల విషయంలో ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా ప్రీ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. దీనితో ఎలా అయినా సరే మన టాలీవుడ్ లో మొట్టమొదటి అందులోను ఫాస్టెస్ట్ 1 మిలియన్ టీజర్ గా నిలపాలి అనుకుంటున్నారు.

ఇక ఇదే కోవలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే టార్గెట్ పెట్టుకున్నారు.ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “వకీల్ సాబ్” టీజర్ కోసం వీరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తారక్ ఫ్యాన్స్ లానే వీరిది కూడా రెండేళ్లకు పైగా నిరీక్షణే..అందువల్ల వాళ్ళు ఒకవేళ మిస్సయినా సరే మొదటి 1 మిలియన్ లైక్డ్ తెలుగు టీజర్ గా దీన్ని నిలపాలని ప్లాన్స్ వేస్తున్నారు. మరి ఇద్దరి హీరోల అభిమానులు ఈ ఫీట్ ను అందుకుంటారా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు