మొదటిసారి గా తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఇలియానా !

మొదటిసారి గా తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఇలియానా !

Published on Nov 8, 2018 1:54 PM IST

‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తరువాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ లోకి వెళ్ళింది హీరోయిన్ ఇలియానా. చాలా గ్యాప్ తరువాత మళ్లీ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం తోతెలుగులో కి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ గోవా బ్యూటీ.

ఇక ఈ చిత్రంలో మొదటి సారిగా తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఇలియానా. మొదటగా చిత్ర డైరెక్టర్ శ్రీను వైట్ల డబ్బింగ్ చెప్పమని అడిగితే నో చెప్పిందట కానీ దర్శకుడు పట్టుబట్టే సరికి కాదనలేక ఒప్పుకుందట కానీ డబ్బింగ్ కరెక్ట్ గా చెప్పిందట. ఇక ఈ చిత్రం తో ఇలియానా గొంతును మొదటి సారిగా తెలుగు ప్రేక్షకులు వినబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 16న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు