‘మహా సముద్రం’ కథ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

‘మహా సముద్రం’ కథ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ !

Published on May 16, 2021 10:39 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా రాబోతున్న సినిమా ‘మహా సముద్రం’. అయితే ఈ సినిమా కథ ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య జరిగే కథ అని, శర్వానంద్ – సిద్ధార్ద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. చిన్న తనంలోనే ఒకరి పై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే డ్రామా అట ఈ సినిమా.

ఇక శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడట. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు