‘రామాయణ 2’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

‘రామాయణ 2’ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Apr 19, 2025 2:00 PM IST

బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు ఎపిక్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ కూడా ఒకటి. మరి ఈ సినిమాలో రణబీర్ రామునిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే ఆల్రెడీ రెండు భాగాలుగా ఈ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఆల్రెడీ పార్ట్ 1 షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారట. ప్రస్తుతం సాయి పల్లవిపై లంకలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ తర్వాత రణబీర్ పై సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. సో ఇలా పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అవుతుంది అని చెప్పాలి. ఇక వీటిలో పార్ట్ 1 ఈ ఏడాదిలో దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా పార్ట్ 2 ని 2027కి లాక్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు