‘శాకినీ- ఢాకినీ’తో హిట్ కొడతాడా ?

‘శాకినీ- ఢాకినీ’తో హిట్ కొడతాడా ?

Published on May 10, 2021 7:01 AM IST

రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ చిత్రానికి ‘శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే,’రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడకపోయే సరికి సుధీర్ వర్మకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

ఇక ఇప్పటికే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సునీత తాటితో కలిసి దగ్గుబాటి సురేశ్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర తమ పాత్రల కోసం కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు