ఇంటర్వ్యూ : కృష్ణకాంత్ (కె.కె) – “రాధే శ్యామ్” నా స్థాయిని పెంచుతుంది

ఇంటర్వ్యూ : కృష్ణకాంత్ (కె.కె) – “రాధే శ్యామ్” నా స్థాయిని పెంచుతుంది

Published on Nov 20, 2021 5:02 PM IST

పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరో హీరోయిన్స్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సాంగ్ “ఈ రాతలే” కొన్ని రోజులు కితమే వచ్చి మంచి స్పందనను అందుకుంది. మరి ఈ అద్భుతమైన సాంగ్ ని రాసిన సాహిత్య రచయిత కృష్ణ కాంత్ మీడియాతో మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర పంచుకున్నారు. మరి అవేంటో చూద్దాం రండి.

చెప్పండి ఇండస్ట్రీలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

2009 లో నా ఫ్రెండ్ శ్రవణ్ భరద్వాజ్ (ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్) తో కలసి”కలయో నిజమో” ఆల్బమ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత హనురాఘవ పూడి గారు ఇచ్చిన ట్యూన్ కు పాటరాస్తే “అందాల రాక్షసి” లో రెండు పాటలు రాసే అవకాశము ఇవ్వడం జరిగింది.ఆ పాటలు పెద్ద హిట్ అయ్యి ఎంతోమంది ఫోన్స్ లలో రింగ్ టోన్స్ గా మారాయి.

మరి ఈ సినిమాకి అవకాశం ఎలా వచ్చింది?

రాధే శ్యామ్ దర్శకుడితో నా జర్నీ జిల్ సినిమా నుండి సాగుతుంది.ఈ చిత్ర దర్శక నిర్మాతలు,మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ లు దగ్గరుండి నాతో పాటలు రాయించుకున్నారు.నేను రాసిన తరువాత దర్శక,నిర్మాతలు ఈ ట్యూన్ కు ఈ లిరిక్ బాగా లేదంటే చేయింజ్ చేసి మళ్లీ,మళ్లీ రాయడం జరిగింది. ఇలా వారందరూ పాటలు బాగా వచ్చే వరకు ఉండి వ్రాయించు కోవడం వల్లే ఈ రోజు ఈ సినిమాలోని సాంగ్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో ఏంతో ఖర్చు పెట్టి తీసిన సాంగ్ రికార్డింగ్ అయిపోయిన పాటను స్విచ్వేషన్ తగ్గట్లులేదని తీసివేశారు.ఇందులో వచ్చే పాటలన్నీ అవసరం ఉన్న చోటే ఉంటాయి.

మీ ఫస్ట్ సాంగ్ కే మంచి రెస్పాన్స్ వస్తుంది, దాని కోసం చెప్పండి

మేము విడుదల చేసిన ‘ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా..ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా” చేసిన సాంగ్ లో కథ ఉంటుంది. ఎక్కువ కథను సీన్స్ లలో చెప్పకుండా ఒక పాటలో మాంటేజ్ లాగా చూపిద్దామని ఈ పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాట వింటుంటే అందరికీ అర్థం కాదు.ఈ సాంగ్ డిఫికల్ట్ గా ఉంటుంది. విజువల్ గా చూస్తే ఎందుకు ఇలా రాశామో అనేది అర్థమవుతుంది.

మీరు రాసిన పాటల్లో మీకు బాగా గుర్తింపు తెచ్చినవి?

నేను చేసిన ఎన్నో సినిమాల పాటలకు ఎంతో పేరు వచ్చినా పడిపడి లేచే మనసు లోని ఏమై పోయావే,టాక్సీవాలా లోని మాటే వినదుగా సాంగ్ కు ఎక్కువ జనాల్లోకి వెళ్లి అందరూ పాడుకునే వరకు వెళ్ళింది. ఆ ఆతరువాత వస్తున్న “రాధే శ్యామ్” లోని ‘ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా” పాటకీ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది ఈ పాట విని నీ లిరిక్స్ బాగున్నాయని ఆఫ్రిసియేట్ చేస్తున్నారు.

చెప్పండి మరి “రాధే శ్యామ్” సినిమా ఎలా ఉండబోతుంది?

ఇది 1970 లో యూరప్ జరిగే లవ్ స్టొరీ.అచ్చ తెలుగు పదాలు ఉండాలని రాయడం జరిగింది.ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడు కుంటున్నారు. కొంతమంది పునర్జన్మల కథ అని,ఇంకొంతమంది టైం ట్రావెల్ అని, సై ఫై సినిమా అని, ట్రైన్ లో జరిగే సినిమా అని ఇలా రకరకాలుగా ఊహించు కుంటున్నారు.ఈ కథ ఎంటనేది వారి ఊహలకే వదిలేద్దాం.

ఈ సినిమా పాటకి మాత్రం ఎక్కువ క్రేజ్ నే వచ్చినట్టు ఉంది?

ఇప్పటి వరకు సుమారు 400 పాటలు పైగా రాసినా కూడా ప్రపంచ దేశాలనుండి ఈ పాటకు పాకిస్తాన్, జపనీస్ ఇలా ఎంతో మంది వారి భాషలో రాసి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు.ఇలా అన్ని భాషలలో తనకు ఫ్యాన్స్ వున్నారు.

ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ కి పాటలు రాయడం ఎలా అనిపించింది?

మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ఉన్న ప్రభాస్ ఇప్పడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.ఆలాంటి వ్యక్తి సినిమాకు పాటలు రాసినందుకు చాలా శాంతోషంగా ఉంది.

మొత్తం ఈ సినిమాకి ఎన్ని పాటలు రాసారు?

ఇప్పటివరకు నా జర్నీ లో నేను చేసిన అన్ని పాటలన్నింటి కంటే ఈ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ ఎక్సపెరమెంటల్ సాంగ్. ఈ సినిమాలో 5 పాటలు రాశాను ,అలాగే నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో 4 పాటలు రాశాను.మేజర్, హిట్ 2, నాగార్జున గారి ఘోస్ట్ ఇలా చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నానని ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు