విక్రమ్ “తంగలాన్” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

విక్రమ్ “తంగలాన్” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on May 23, 2023 6:06 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం తంగలాన్. ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పా రంజిత్ మాట్లాడుతూ, తాము 105 రోజుల షూటింగ్‌ని విజయవంతంగా పూర్తి చేశామని, మరో 20 రోజుల పాటు షూటింగ్‌తో సినిమా మొత్తం పూర్తవుతుందని పేర్కొన్నారు.

షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, 2024 ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ మరియు ఇతరులు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ, విదేశీ భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదల చేయడానికి ధృవీకరించబడింది. స్టూడియో గ్రీన్ మరియు నీలం ప్రొడక్షన్స్ బ్యాకప్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు