టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీ ‘జాట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తనదైన మాస్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఇక ఈ సినిమా తొలి వారంలోనే సాలిడ్ వసూళ్లు రాబట్టడంతో ఈ చిత్రం ఉత్తరాదిన మంచి రన్ వైపు వెళ్తోంది. అయితే, ఈ సినిమాలోని ఓ సెన్సిటివ్ సీన్ ఉందని ఓ మతం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారు ఈ సినిమా యూనిట్పై తీవ్రంగా మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ వివాదంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.
కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని వార్తలు రావడంతో తాము చింతిస్తున్నామని.. వారిని ఇబ్బంది పెట్టే సన్నివేశాలను తొలగిస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా తమ సినిమా ఉందని తెలియడంతో తాము క్షమాపణలు తెలుపుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Our sincere apologies to everyone whose sentiments were hurt.
The objectionable scene has been removed.#JAAT pic.twitter.com/vj8tbKDxoi— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025