అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే బాధ వర్ణణాతీతం అంటూ తాజాగా జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఇంతకీ, జాన్వీ కపూర్ ఏం మాట్లాడింది అంటే.. ‘నాకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. నా మాట తీరుని బట్టి నేను పీరియడ్స్లో ఉన్నానని ఎదుటి వారికి అర్థం అయిపోతుంది. అందుకే, నేను చిరాకుగా మాట్లాడగానే ‘నీకు ఇది ఆ సమయమా’ అని అడుగుతారు. అయితే ఈ ప్రశ్న అడిగే విధానమే ఒక్కోసారి బాధను కలిగిస్తుంది’ అని జాన్వీ కపూర్ తెలిపింది.
జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘కొందరు అబ్బాయిలు ఈ నెలసరి నొప్పి అనేది చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ వ్యంగంగా మాట్లాడతారు. దీన్ని అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మనకు ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. విశ్రాంతి తీసుకోమని సలహాలిస్తారు. ఇక ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ నొప్పికి అణుయుద్ధాలే జరిగేవేమో..!’ అని జాన్వీ కపూర్ తెలిపింది. అన్నట్టు గత కొంతకాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ తో జాన్వీ కపూర్ డేటింగ్లో ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే… ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటు చరణ్ పెద్ది సినిమాలోనూ జాన్వీ నటిస్తోంది.