నా ప్రతీ నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు.- ఎన్టీఆర్

నా ప్రతీ నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు.- ఎన్టీఆర్

Published on Mar 22, 2021 12:02 AM IST

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెల్లవారితే గురువారం. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా మార్చి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

నవ్వి నవ్వి కింద పడిపోతారు.. ఎడిటర్ సత్య మాట్లాడుతూ.. ‘సినిమా నిడివి రెండు గంటలే. చిత్రాన్ని పరిగెత్తించాం. థియేటర్లో ప్రేక్షకులు నవ్వి నవ్వి కింద పడిపోతారు’ అని చెప్పుకొచ్చారు. తారక్ అన్న గెస్ట్‌లా రావడం కలలా ఉంది… దర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ.. ‘మార్చి 27న తెల్లవారితే గురువారం మూవీ రాబోతోంది. యూత్ అయితే అరవింద సమేతతో వెళ్లండి.. ఫ్యామిలీ అయితే సకుటుంబ సమేతంగా రండి. సినిమాను చూస్తే అదుర్స్ అనిపించేలా చేస్తాం. నా మొదటి సినిమాకు తారక్ అన్న గెస్ట్‌లా రావడం కలలా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. అయితే ఇంట్లో వాళ్లు ఏ కొంచెం చేసినా కూడా బాగుందని మాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం మీరు శుక్రవారం చెప్పాలి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్ మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడి గురించి మీరు చెప్పాలి.. ట్రైలర్, టీజర్ చూస్తేనే సినిమా చాలా రిచ్‌గా ఉందని తెలుస్తోంది. నిర్మాతలు అద్భుతంగా నిర్మించారు. మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు’ అని అన్నారు.
సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. మీరు (అభిమానులు) అరిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడుతుంటాను.. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. రేపొద్దున భార్గవ్, అభయ్‌ను చూసి కూడా ఎంతో సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు