
ఎన్టీఅర్ తదుపరి సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ‘బాద్ షా’,’బృందావనం’ సినిమాల తరువాత ఎన్టీఅర్ కాజల్ జంటగా నటిస్తున్న మూడవ సినిమా ఇది. పూరి జగనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. వక్కంతం వంశీ రాసిన కథకు దర్శకత్వం వహించడం పూరికి ఇది మొదటిసారి కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.