డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ “సర్దార్”

డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ “సర్దార్”

Published on Nov 18, 2022 11:02 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. ఈ చిత్రం లో డ్యూయల్ రోల్ లో నటించిన కార్తీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. గూఢచారి గా నటించిన కార్తీ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది.

నేటి నుండి ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో లో ప్రసారం అవుతోంది. రాశి ఖన్నా, రజిష విజయన్, లైలా, చుంకి పాండే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం ను థియేటర్ల లో చూడటం మిస్ అయిన వారు ఆహా వీడియో లో చూడవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు