ఏప్రిల్ 23న విడుదల కానున్న ‘కథానిక’ !!

ఏప్రిల్ 23న విడుదల కానున్న ‘కథానిక’ !!

Published on Apr 17, 2021 10:00 AM IST

మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం “కథానిక”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో
నిర్మాత రామ రావు లెంక మరియు పద్మ లెంక మాట్లాడుతూ “మేము ఈ చిత్రాన్ని కరోనా టైం లో షూటింగ్ చేసాం. మా చిత్ర నటీనటులు, టెక్నీషియన్ అందరు బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ జగదీష్ దుగన అద్భుతంగా చిత్రీకరించారు. మేము ఈ నెల ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

దర్శకుడు జగదీష్ దుగన మాట్లాడుతూ “మా కథానిక చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీదకి ఈ కథ రాలేదు. మా నిర్మాతలు సినిమా కి ఎంత కావాలో అంత ఖర్చుపెట్టారు. మ్యూజిక్ లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. అందరు చూసి నన్ను ఆశీర్వదించండి” అని తెలిపారు.

హీరో సాగర్ మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. కరోనా టైం లో ఈ చిత్రం లో నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది” అని తెలిపారు.

షేకింగ్ శేషు మాట్లాడుతూ “ఈ చిత్రం లో ఒక చిన్న పాత్ర చేశాను. చాలా బాగుంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ నైనీషా మాట్లాడుతూ “నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన దర్శకుడు జగదీష్ దుగన నిర్మాత శ్రీమతి పద్మ లెంక గారికి నా ధన్యవాదాలు. కరోనా టైం లో సినిమా చిత్రరించాం. ఇప్పుడు ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది అందరు థియేటర్ లో తప్పక చుడండి” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు