కొరటాల మెగాస్టార్ తో తర్వాత ఎన్టీఆర్ తోనట ?

కొరటాల మెగాస్టార్ తో తర్వాత ఎన్టీఆర్ తోనట ?

Published on Aug 2, 2018 10:19 AM IST

మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు.

కాగా కొర‌టాల మ‌హేష్ బాబుతో చేసిన భ‌ర‌త్ అనే నేను చిత్రంతో కొత్త రికార్డ్ లు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంద‌ని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా త‌ర్వాత కొర‌టాల ఎన్టీయార్‌ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. 2020లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఐతే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు