“ఎన్టీఆర్” దర్శకుడు వెబ్ సిరీస్ కి నిర్మాతగా మారాడా?

“ఎన్టీఆర్” దర్శకుడు వెబ్ సిరీస్ కి నిర్మాతగా మారాడా?

Published on Jun 19, 2019 1:12 PM IST

టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకులలో క్రిష్ ఒకరు. కేరీర్ ప్రారంభంలోనే “గమ్యం”, “వేదం” లాంటి ప్రయోగాత్మక చిత్రాలు సోషల్ కంటెంట్ తో తీసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో బాలయ్యతో పీరియాడిక్ స్టోరీతో “గౌతమీపుత్ర శాతకర్ణి” మూవీ తీసిన క్రిష్ ఈ సంక్రాంతి కి ఎన్టీఆర్ బయో పిక్ లను ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలను విడుదల చేశాడు. ఐతే వాటి తరువాత ఆయన మళ్ళీ కొత్త సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా ఈ విషయం పై ఆయన పెదవి విప్పినట్టు సమాచారం. క్రిష్ తన తదుపరి చిత్రాని కంటే ముందు ఇంకో ప్రాజెక్టు తీసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన తన సొంత బ్యానర్ లో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట.
వెబ్ సిరీస్ కి సంబంధించి కథ, కథనం, మాటలు పూర్తి చేసి, దర్శకత్వ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించే పనిలో ఉన్నాడట. తర్వాత తన తదుపరి సినిమా పనులు మొదలుపెడతారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు