“పుష్ప 2” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్..!

“పుష్ప 2” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్..!

Published on Aug 9, 2022 8:02 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఈ సినిమా యూనిట్ ల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్లాన్ చెయ్యగా దానిపై పాన్ ఇండియన్ లెవెల్లో డబుల్, ట్రిపుల్ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం మ్యూజికల్ వర్క్స్ అయితే మేకర్స్ చేస్తున్నారట. ఈసారి కూడా అదిరే ట్యూన్స్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈసారి ఆల్బమ్ అయితే ఎలాంటి సెన్సేషన్ ని నమోదు చేస్తుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు