కొత్త టిక్కెట్ ధరల ఫైలు పై సీఎం జగన్ సంతకం

కొత్త టిక్కెట్ ధరల ఫైలు పై సీఎం జగన్ సంతకం

Published on Mar 7, 2022 5:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో టికెట్ ధరలపై ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ నెల ప్రారంభంలో, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో సమావేశమై చర్చించారు.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, సినిమా టిక్కెట్ రేట్ల ఫైలు పై వైఎస్ జగన్ ఈరోజు సంతకం చేశారని, ఈరోజు లేదా రేపు కొత్త జీఓ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2021లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరలను తగ్గించడానికి GO ను ఆమోదించింది. అనంతరం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో పలుమార్లు చర్చించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు