కోవిడ్-19 మరియు న్యుమోనియా నుండి కోలుకున్న లతా మంగేష్కర్

కోవిడ్-19 మరియు న్యుమోనియా నుండి కోలుకున్న లతా మంగేష్కర్

Published on Jan 30, 2022 7:31 PM IST


లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ లతా మంగేష్కర్ కోవిడ్-19 మరియు న్యుమోనియా నుండి కోలుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ధృవీకరించారు. లతా మంగేష్కర్ జనవరి 11, 2022న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చేరిన సంగతి తెలిసిందే.

ఈరోజు ఆరోగ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయని లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీతో మాట్లాడినట్లు తెలిపారు. ఆమె కోలుకుంది, కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉంది, కానీ ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఆమె ఇప్పుడు వెంటిలేటర్‌ పై లేరు. ఆమెకు ఆక్సిజన్ మాత్రమే ఇస్తున్నారు. ఆమె చికిత్సకు స్పందిస్తోంది. ఈ వార్త విన్న తర్వాత ఆమె అభిమానులు సంతోషంగా ఉన్నారు మరియు ఆమె మళ్లీ ఆరోగ్యంగా ఉండటానికి వారి అపారమైన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె త్వరలో డిశ్చార్జ్ చేయబడతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు