మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్లోని టీవర్క్స్లో జరిగిన నోటి క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయీ కలుపుదాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా శ్రమించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అన్నిటికి కించే వ్యసనాలకు బానిసలై తమ కలలను దూరం చేసుకుంటున్న యువతను రక్షిద్దాం’ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో “విశ్వంభర” సినిమా రాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి మెగాస్టార్ ఇటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నాడు.