టాలీవుడ్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన ‘మ్యాడ్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా రీసెంట్గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ లీడ్ రోల్స్ పోషించారు.
ఈ సినిమా థియేటర్లలో మార్చి 28న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ను సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది.
దీంతో ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.