వెబ్ సిరీస్ చేయనున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్

వెబ్ సిరీస్ చేయనున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్

Published on Dec 9, 2019 11:08 PM IST

బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ నేడు ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆయన పంచుకోవడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే మాధురి దీక్షిత్ ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారట. నెట్ ఫ్లిక్ ఇండియా భాగస్వామ్యంతో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సిరీస్ ని నిర్మించనున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సిరీస్ టైటిల్ ఏమిటీ? ఎప్పుడు మొదలవుతుంది? ఏ జోనర్ వంటి విషయాలు ఆయన తన ట్వీట్ లో పొందుపరచేలేదు.

ఈ వెబ్ సిరీస్ నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియాల్సివుంది. దశాబ్దాలుగా బాలీవుడ్ లో మాధురీ దీక్షిత్ తిరుగులేని నటిగా ఉన్నారు. 2007లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మాధురీ దీక్షిత్ 2014 లో దేడ్ ఇష్కియా చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది టోటల్ ఢమాల్, ఆగస్టు 15, కళంక్ చిత్రాలలో ఆమె నటించడం జరిగింది. తాజాగా ఆమె ఇలా వెబ్ సిరీస్ లో నటించడం ఆమె అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి.

https://twitter.com/karanjohar/status/1203950883005968384?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు