వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమవుతున్న “మహ సముద్రం”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమవుతున్న “మహ సముద్రం”

Published on Dec 9, 2021 5:01 PM IST

శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మహ సముద్రం. ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించడం జరిగింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

ఈ చిత్రం అతి త్వరలో జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. రావు రమేష్, రామచంద్ర గరుడ, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందొ చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు