మహర్షి నుండి లేటెస్ట్ అప్డేట్ !

మహర్షి నుండి లేటెస్ట్ అప్డేట్ !

Published on Mar 27, 2019 9:25 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ వెలుబడింది. ఈచిత్రం నుండి మొదటి సాంగ్ ను ఈనెల 29న ఉదయం 9:09 గంటలకు విడుదలచేయనున్నారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ‘చోటి చోటి’ అంటూ సాగె ఈ సాంగ్ ను మహేష్ , అల్లరి నరేష్ , పూజా హెగ్డే లపై చిత్రీకరించారు. .

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు