‘మహర్షి’ డిజిటల్ రైట్స్ భారీ ధరకు !

‘మహర్షి’ డిజిటల్ రైట్స్ భారీ ధరకు !

Published on Apr 1, 2019 5:28 PM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు