వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ చిత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ విలేజ్ సెట్ లో ఈ రోజుతోటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేశారు. సెకెండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.
కాగా మహర్షి తరువాత షెడ్యూల్ జనవరి నుండి మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Superstar @urstrulyMahesh's #Maharshi RFC schedule wraps up today. Next schedule begins in January,2019. @directorvamshi Directorial #SSMB pic.twitter.com/XQatF4oMEN
— Nikkil (@onlynikil) December 25, 2018