బ్రెజిల్ దేశంలోని ప్రపంచంలోనే అతి పెద్ద రైన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ రెండు వారాలుగా కార్చిచ్చుతో తగలబడిపోతుంది. లక్షల ఎకరలాల మేర పచ్చని అడవి బూడిదై పోతుంది. పర్యావరణం తో పాటు, జీవవైవిధ్యం ఆ మంటల ధాటికి నాశనమై పోతుంది. దీనితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
కొన్ని రోజులుగా బాలీవుడ్ తారలు ఈ విషయం పై వరుస ట్వీట్ లు చేస్తూ దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విపత్కర సంఘటనపై టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా , దిగ్ర్బాంతికర వార్త, ప్రపంచ ఊపిరి తిత్తులుగా పిలువబడే అమెజాన్ ఫారెస్ట్ మంటలలో చిక్కుకుంది. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ ని ఎలా కాపాడాలని ఆయన వెల్లడించడం జరిగింది.
Deeply disturbing news… the #AmazonRainforest, rightfully called the 'lungs of our planet'… contributing to 20% of the world's oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted… #PrayfortheAmazon pic.twitter.com/FNbSJnyNvJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2019