‘కీర్తి’తో మహేష్ ట్రాక్ ఎంటర్ టైన్ గా ఉంటుందట !

‘కీర్తి’తో మహేష్ ట్రాక్ ఎంటర్ టైన్ గా ఉంటుందట !

Published on Jul 11, 2021 12:12 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్లో అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ – కీర్తి సురేష్ మధ్య నడిచే లవ్ ట్రాక్ చాల ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఎలాగూ పరుశురామ్ లవ్ ట్రాక్ లను బాగా రాస్తాడనే పేరు ఉంది కాబట్టి, మహేష్-కీర్తిల మధ్య కూడా బలమైన ట్రాక్ ను రాసినట్లు తెలుస్తోంది.

కాగా పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి.. పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక పరుశురామ్ కెరీర్ లోనే వచ్చిన మొదటి పెద్ద ఛాన్స్ ఇది.. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు