‘మహర్షి’ కోసం మహేష్ మళ్లీ మూడో వారం నుండి !

‘మహర్షి’ కోసం మహేష్ మళ్లీ మూడో వారం నుండి !

Published on Jan 1, 2019 5:18 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ విలేజ్ సెట్ లో పల్లెటూరు నేపథ్యంలో సాగే సన్నివేశాలను షూటింగ్ జరుపుకుంది. ఈ సన్నివేశాలు సెకెండాఫ్ లో వస్తాయని ఇవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

కాగా మహర్షి తరువాత షెడ్యూల్ ఈ నెల మూడో వరం నుండి మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు