ఒక్క సినిమాతో మహేష్ కి అంతటి ఆప్తుడు ఎలాయ్యాడు?

ఒక్క సినిమాతో మహేష్ కి అంతటి ఆప్తుడు ఎలాయ్యాడు?

Published on Jul 21, 2019 11:24 AM IST

మహేష్ నటించిన గత చిత్రం “మహర్షి” మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ఏరియాలలో ఈ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో 30కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఐతే ఈ మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ మధ్య అనుబందం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మూవీ తరువాత వీరిద్దరూ మంచి స్నేహితులైపోయారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో మహేష్ కి సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులలో వంశీ పైడిపల్లి ఒకరు. వీరిద్దరూ కలిసి పనిచేసింది కేవలం ఒక చిత్రానికి మాత్రమే. “మహర్షి” మూవీ అనంతరం మహేష్ కుటుంబంతో కలిసి వరల్డ్ టూర్ కి వెళ్లగా, కొన్నిరోజుల తరువాత వంశీ వాళ్లతో జాయిన్ అయ్యి టూర్ ఎంజాయ్ చేయడం జరిగింది.

కాగా నిన్న మహేష్ కూతురు సితార బర్త్ డే వేడుకలు ఓ హోటల్ లో జరుగగా ఈ వేడుకకు కేవలం కొందరు సన్నిహితులలో పాటు, చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో అనిల్ రావిపూడి,మెహర్ రమేష్,దేవిశ్రీ, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. ఇలా మహేష్ తనకి సంబందించిన ప్రతి ముఖ్య కార్యక్రమానికి వంశీ పైడిపల్లి ని ఆహ్వానిస్తూ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు