ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ !

ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ !

Published on Apr 30, 2019 3:50 PM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో జరుగనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి థియేట్రికల్ ట్రైలర్ ను కూడా ఈవెంట్ లో రేపు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవలే విడుదులైన టీజర్ లో, సూపర్ స్టార్ మూడు వేరియేషన్స్ లో కనిపించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్తగా, స్టూడెంట్ గా మరియు ఒక కామెన్ మెన్ గా మహేష్ కనిపించి అలరించారు. మరి ట్రైలర్ లో ఎలా కనిపిస్తారో చూడాలి.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు