మహేష్ ‘సర్కారు’ లేటెస్ట్ అప్ డేట్ !

మహేష్ ‘సర్కారు’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 18, 2021 3:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’ లాస్ట్ షెడ్యూల్ ను దుబాయ్‌లో నెల రోజుల పాటు షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ షెడ్యూల్ జరుపుతున్నా.. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ షెడ్యూల్ క్యాన్సల్ అయినట్టు తెలుస్తోంది. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది. అంటే మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయట. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు