ఆకట్టుకుంటున్న ‘మత్తు వదలరా’ ట్రైలర్ !

ఆకట్టుకుంటున్న ‘మత్తు వదలరా’ ట్రైలర్ !

Published on Dec 18, 2019 4:05 PM IST

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. కాగా తాజగా ఈ చిత్రం ట్రైలర్ ను రానా విడుదల చేశారు. ట్రైలర్ లో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ప్రధాన పాత్రలను.. ఆ పాత్రల మధ్య సంఘర్షణను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా శ్రీసింహా- సత్యల మధ్య వచ్చే సీన్స్ సినిమాలో బాగా అలరిస్తాయని అనిపిస్తోంది. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో మనస్తత్వం వున్న కథానాయకుడిగా రెండు గెటప్స్ తో శ్రీ సింహా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. అలాగే ట్రైలర్ చివర్లో శ్రీసింహా క్యారెక్టర్ లోని వెరియేషన్ చాల బాగుంది మొత్తానికి ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సినిమా పై అంచనాలను పెంచింది.

కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు