మహేష్, ఎన్టీఆర్, చైతు పై మెమొరబుల్ పిక్ వైరల్.!

మహేష్, ఎన్టీఆర్, చైతు పై మెమొరబుల్ పిక్ వైరల్.!

Published on Nov 16, 2022 8:00 AM IST

మన తెలుగు సినిమా దిగ్గజ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు నిన్న ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. దీనితో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక విషాద ఘటనతో మహేష్ వద్దకు మన టాలీవుడ్ సినీ తారలు చేరుకోగా మహేష్ కి ధైర్యం చెప్పారు. ఇక కలయికలో అయితే చాలా మంది అభిమానులు తమ హీరోలతో కలిసి చూడాలి అనుకున్నారు కానీ ఇలాంటి సందర్భాల్లో చూడాలి అనుకోలేదని వాపోతున్నారు.

అయితే ఈ కలయికలో మహేష్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అక్కినేని నాగ చైతన్య లు కలిసి ఉన్న ఓ స్నాప్ బయటకొచ్చింది. మరి సరిగ్గా వీరి కలయికలో అలనాటి తారలు సూపర్ స్టార్ కృష్ణ తో అక్కినేని నాగేశ్వరరావు అలాగే నందమూరి తారక రామారావు లతో కలిసి ఎగ్జాక్ట్ గా ఉన్న ఫొటోతో కలిసింది. దీనితో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో అభిమానుల్లో మంచి వైరల్ గా మారింది. అయితే వీరి కలయిక ఇలా ఉండి ఉండకూడదు అని చాలా మంది మరింత విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు